నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం బోల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనంతారాన్ని జిల్లా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం ఆఫీసర్ డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ శిల్పిని కాయకల్ప నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, మరింత వైద్య సేవలు పటిష్టపరిచే విధంగా విధివిధానాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. రోగులకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ ఆకస్మికంగా కాయకల్ప నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఉత్తమ వైద్య సేవల ఇవ్వడానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఏర్పాటు అయ్యావని అందులో పల్లె దవాఖాన డాక్టర్ల నియమించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్, రమేష్ నాయక్, సురేష్ కుమార్, వసుధ, రమాదేవి, లింగలక్ష్మి, శోభ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
కాయకల్ప పర్యవేక్షించిన వైద్యాధికారి డా.మనోహర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES