– పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలు అందించాలి : సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చిట్యాల
మూసీ నది ప్రక్షాళన చేసి, ఆ పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలు అందించాలని సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మేకల లింగయ్య స్మారక భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన కోసం రూ.1,50,000 కోట్లు కేటాయించి, మూసీ సుందరీకరణ పనుల పేరుతో కాకుండా కాలుష్యం నివారణకు కృషి చేసి, గోదా వరి జలాలను అందించాలని కోరారు. రామన్నపేటలో అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ కంపెనీని ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించి, నిరసనలు వ్యక్తం చేశార ని, కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ప్రకటనా రాలేదని తెలి పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలైన ఆసరా పింఛన్ రూ.4000, ప్రతి మహిళకూ నెలకు రూ.2500 అమలు చేయడం లేదన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు వేగవంతం చేయాలని కోరారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంతో సొరంగం పనులు పెండింగ్లో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, నాయకులు ఐతరాజు యాదయ్య, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, జిట్ట స్వామి, కృష్ణ ఉన్నారు.
మూసీ నది ప్రక్షాళన చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES