Sunday, January 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుస్కాం జరిగినందుకే నైనీ టెండర్‌ రద్దు

స్కాం జరిగినందుకే నైనీ టెండర్‌ రద్దు

- Advertisement -

సోలార్‌ కుంభకోణంపై భట్టి మౌనమెందుకు : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నైనీ టెండర్‌ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా?అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మసిపూసి మారేడుకాయ చేయొద్దనీ, సోలార్‌ పవర్‌ స్కాంపై ఉప ముఖ్యమంత్రి భట్టి మౌనమెందుకు పాటిస్తున్నారని అడిగారు. రేవంత్‌రెడ్డి బామ్మర్ది కోసమే ఈ తతంగమంతా జరిగిందని తెలిపారు. సింగరేణి బొగ్గు, సోలార్‌ టెండర్ల వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్‌ మీట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు శనివారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. నైనీ టెండర్‌ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా మసిబూసి మారేడు కాయ చేశారని తెలిపారు. ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్‌ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజమని స్పష్టం చేశారు.

అందులో రేవంత్‌రెడ్డి బామ్మర్ది రింగ్‌ మెన్‌గా పాత్ర పోషించిందీ నిజమని తెలిపారు. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. తాను బయటపెట్టిన మరో కుంభకోణం సోలార్‌ పవర్‌ స్కాం గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని పేర్కొన్నారు. నైనీ టెండర్‌ను రద్దు చేసినట్టే మిగతా అన్ని టెండర్లనూ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. సైట్‌ విజిట్‌ సర్టిఫికేట్‌ నిబంధనను బీఆర్‌ఎస్‌ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్ధాలు అయిపోవని తెలిపారు. స్కాంలు, స్కీంలుగా మారిపోవని వివరించారు. సైట్‌ విజిట్‌ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారరని అడిగారు. సైట్‌ విజిట్‌ అమలయ్యిందనీ, నైనీ టెండర్‌ రద్దు జరిగిందంటే స్కాం జరిగినట్టే కదా?అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్‌ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవని సూచించారు. రేవంత్‌రెడ్డి, అతని బామ్మర్ది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తానని హామీ ఇస్తే భట్టికి లేఖ రాయడానికి సిద్దమని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -