Monday, July 7, 2025
E-PAPER
Homeనిజామాబాద్జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయలి

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయలి

- Advertisement -

– కందరపు రాజనర్సు జిల్ల అధ్యక్షులు

– రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ను వెంటనే ఉపసంహరించుకోవాలి

నవతెలంగాణ –  కామారెడ్డి

 మున్సిపల్ ఆఫీస్ వద్ద సోమవారం ఉదయం 5 గంటలకు హాజరు  పాయింట్ల వద్ద ( సిఐటియు ) మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ని ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమనీ ఈనెల 9న నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రతి మున్సిపల్ కార్మికులు హాజరై విజయవంతం చేయాలనీ మున్సిపల్ యూనియన్ ( సిఐటియు ) జిల్లా అధ్యక్షులు కందారపు రాజనర్సు అన్నారు. ఈ సందర్భంగా ఆయన   మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం  కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులను హరించే విధంగా, కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అందించాలని తదితర డిమాండ్లతో జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 282 ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జూలై 9వ తేదీన మున్సిపల్ ఆఫిస్ నుండి  అంబేద్కర్ చౌక్ వరకు వేలాది మంది కార్మికులతో ర్యాలీ ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ నాయకులు శివ, రాజవ్వ, దీవెన, జ్యోతి, సావిత్రి , ఇంద్ర, విజయ్, కిషన్, భరత్, శేఖర్, లక్ష్మణ్, గంగవ్వ, దోమకొండ బాలమణి,  సుల్తాన్, నర్సయ్య ,  మల్లయ్య, రాజయ్య , విజయ , దుర్గ ప్రసాద్, బైండ్ల సులోచన, సుశీలమ్మ  , లక్ష్మి , నరేష్ , శ్రీను మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -