Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..

మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..

- Advertisement -

వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఏఐటీయూసీ అనుబంధ సంఘం  మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మే 20వ తేదీన విజయవంతం చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సమ్మె వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలరాజ్ లు మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ.. ఈ 20 తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనము 60 జీవో ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని,  18 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని అనేకసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసిన కార్మిక చట్టాలను పట్టించుకోకుండా కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకే పని ఇవ్వాలని కార్మికుల శ్రమదోపిడికి గురవుతున్నారని కార్మికుల యొక్క రోజువారి కొన్ని కారణాలవల్ల రానివారి డబ్బులు రాష్ట్రవ్యాప్తంగా  కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు మిగిలిపోతున్నాయన్నారు. ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్ కార్మికులుగా లేదా థర్డ్ సెక్షన్ కార్మికులుగా కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటే కోట్లాది రూపాయలు కార్మికుల డబ్బులు మిగులుతాయని అన్నారు. ప్రభుత్వానికి మిగులుతూ కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు.  కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జీవో ప్రకారం 26వేల రూపాయలు ఇవ్వాలని లేదా 65వ ప్రకారం 21000 ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట తప్పి కేవలం రూ15 వేల 600 ఇవ్వడం జరుగుతుందని, ఎలాంటి జీవో లేకుండా రూ.11000 కార్మికులకు రూ.3000 పిఎఫ్ ఈఎస్ఐ పేరుతో అదనంగా రూ.1000 కాంట్రాక్టర్లు  కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కార్మికులకు పని ఇచ్చి కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, కార్మికుల కనీస ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయించాలని, పని భారాన్ని తగ్గించాలన్నారు. కార్మికులకు కనీస జాతీయ సెలవులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు   కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా అధ్యక్షులు ఎం శ్రీనివాస్, జిల్లా కోశాధికారి ఎండి రఫీ, కామారెడ్డి ప్రభుత్వ పట్టణ అధ్యక్షులు సందీప్, ఆసుపత్రి కార్మికులు ఖై రత్ అలీ, భాస్కర్, రజిత, లక్ష్మి, జమున, నాగమణి, వాసవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -