Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫలిస్తున్న ఆపరేషన్‌ చేయూత..

ఫలిస్తున్న ఆపరేషన్‌ చేయూత..

- Advertisement -

– 17 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం

ప్రభుత్వం ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ”ఆపరేషన్‌ చేయూత” కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు తెలిపారు. ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు శుక్రవారం లొంగిపోయారని తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పీ మాట్లాడారు. ”ఆపరేషన్‌ చేయూత” ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయల గురించి తెలుసుకుని మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 282 మంది మావోయిస్టు దళసభ్యులు జనజీవన స్రవంతిలో కలిసి తగిన పునరావాస సౌకర్యాలను పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం మావోయిస్టు సాయుధ దళాలు సంచరిస్తున్నట్టు తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించకూడదని తెలిపారు. ఇటీవల ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
అజ్ఞాత దళసభ్యులు, వారికి సహకరించే మిలీషియా, ఆర్పీసీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని, ప్రశాంతమైన జీవనం గడపాలని కోరారు. లొంగిపోయిన వారికి పునరావాస సౌకర్యాలు కల్పించేం దుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కృషిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్‌ జి.నరేందర్‌, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, 141 బెలాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ ప్రీతా, 81 బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ రవిశర్మ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, చర్ల సీఐ రాజు వర్మ, ఆర్‌ఐ ఆపరేషన్స్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -