- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆ పార్టీ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కవిత తీరు కరెక్ట్ కాదు. క్షమించరానిది. పార్టీకి నష్టం చేకూర్చేలా ఆమె మాట్లాడారు. కవితకు ఎందుకు అంత ఆవేశం? కొంచెమైనా ఓపిక ఉండాలి కదా? లేఖ అంశంపై కేసీఆర్ మాట్లాడతారు కదా? ఎందుకంత తొందరపాటు? కాళేశ్వరం నోటీసులపై చర్చిస్తూ ఆయన బిజీగా ఉన్నారని తెలియదా? దేవుడు లాంటి కేసీఆర్ పైనే దండెత్తుతారా?’ అని ధ్వజమెత్తారు.
- Advertisement -