నవతెలంగాణ – కామారెడ్డి
కోర్టులకు తిరిగే కంటే రాజీమార్గం ద్వారా రాజకుదరుచుకుంటే రాజమార్గం అని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు అన్నారు. ప్రజలు చిన్న చిన్న కేసులకు సైతం కోట్ల చుట్టు తిరగకుండా లోకాదాలతో రాజీ కుదరచుకుంటే కేసులు పరిష్కారం అవుతాయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో జిల్లా లో నేడు లోక్ అదాలత్ నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అనంతరం నేడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ డాక్టర్, సి హెచ్, వి ఆర్ ర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసు పరిష్కారం అయి అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుంది. చీటింగ్ కేసులు, సైబర్ కేసులు, బ్యాంకు ప్రీ లిటిగేషన్ కేసులు , చెక్ బౌన్స్ కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా భార్య భర్తల కేసులు కూడా పరిష్కారం చేయబడుతుందన్నారు.
వారితో మాట్లాడి కలపడానికి ప్రయత్నించడం రాజి చేయడం వాళ్ళ వాటికి సంబంధించిన మిగతా కేసులు పరిష్కారం అయినట్టే అన్నారు. 498 ఐపీసీ కేసులలో కూడా మొదట పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేయకుండా జాతీయ కోర్టు చెప్పిన విధంగా మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారని భావిస్తున్నాను అన్నారు. డిఎల్ఎస్ఎ కార్యదర్శి టి .నాగరాణి మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారం చేసి జిల్లా కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా అడిషనల్ సూపెరింటెండ్ అఫ్ పోలీస్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని జిల్లా పోలీస్ లకి సూచనలు కూడా ఇచ్చామన్నారు. బార్ ప్రెసిడెంట్ నంద రమేష్ మాట్లాడుతూ మా న్యాయవాదులందరు పూర్తి సహకారం ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్. సుమలత , జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి సుధాకర్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి దీక్ష, జిల్లా అడిషనల్ సూపెరింటెండ్ అఫ్ పోలీస్ నర్సింహా రెడ్డి , పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా గోపాల్ గౌడ్ , ఏపీపీ దామోదర్ రెడ్డి , సూర్య ప్రకాష్, సిఐలు చంద్ర శేఖర్ రెడ్డి, సంపత్, న్యాయవాదులు శంకర్ రెడ్డి, దేవరాజ్ గౌడ్, శ్రీధర్, శ్యామ్ గోపాల్ రావు , న్యాయ శాఖా సిబ్బంది భుజంగ్ రావు , శ్రీధర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.