కొన్నేండ్ల కిందట ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్కు చెందిన ఒక ముస్లిం మహిళ గర్భంతో ఉండి రక్తహీనతతో బాధపడుతోంది. ఆమె రంజాన్ మాసంలో ఉపవాసం ఉండాలా లేదా బాగా తిని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా అనే సందిగ్దంలో ఉంది. ఆ వార్త భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న హైపర్లోకల్ స్టేషన్ల నెట్వర్క్ అయిన స్మార్ట్ (సీకింగ్ మోడరన్ అప్లికేషన్స్ ఫర్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్) కమ్యూనిటీ రేడియో దృష్టికి వచ్చింది. ఇది సంప్రదాయం, జీవితాలకు మధ్య ఉండే వాస్తవాల గురించి సంభాషణను రేకెత్తించింది. కమ్యూనిటీ రేడియో విలేకరులు నేరుగా స్థానిక ఇమామ్ వద్దకు వెళ్లారు. ఆయన వెంటనే గర్భిణీ స్త్రీలు రంజాన్లో ఉపవాసం మానుకోవాలని ఒక సలహా జారీ చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ ఆపరేటింగ్ కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు మద్దతు ఇచ్చే ఈ స్మార్ట్ కమ్యూనిటీ రేడియోను అర్చన కపూర్ స్థాపించారు. మీడియాలో తప్పుడు సమాచారం విపరీతంగా ప్రచారమవుతున్న యుగంలో ఈ రేడియో నమ్మకం, గ్రౌండ్ రియాలిటీని ప్రతిబింబిస్తుంది. హర్యానాలోని న్యూహ్(గతంలో మేవాట్) జిల్లాకు చెందిన ఆమె సొంత స్టేషన్ రేడియో మేవాట్ జిల్లాలోని 168 గ్రామాలకు సేవలు అందిస్తుంది. నాలుగు బ్లాక్లలో సుమారు ఆరున్నర లక్షల మంది శ్రోతలను చేరుకుంటుంది. ఈ కమ్యూనిటీ రేడియో సమాచార వ్యాప్తికి మాత్రమే కాకుండా పరివర్తనకు ఓ సాధనంగా కూడా పనిచేస్తోంది. ‘వాస్తవాల కంటే పుకార్లు వేగంగా ప్రయాణించే తరుణంలో నిజాలను నిర్భయగా చెబుతూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాము’ అంటూ అర్చన ఇటీవల ఓ వెబ్సైట్తో పంచుకున్నారు.
కమ్యూనికేషన్కు సాధనం
సమాజం, స్థానిక పరిపాలన, దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య వారధిగా పనిచేస్తున్నాం’ అర్చన అంటున్నారు. 90.4 ఎఫ్.ఎంలో ఇవి ప్రసారం అవుతాయి. క్షయ, ప్రసూతి ఆరోగ్యం, పారిశుధ్యం, కోవిడ్-19 అవగాహన, పాలన వంటి ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. అంతేకాదు లింగ వివక్ష, గృహ హింస, విద్య, ఆర్థిక అక్షరాస్యతపై కూడా దృష్టి సారిస్తాయి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఉల్జ్జానేన్, మహిలాన్ కి బాత్, గావ్ గావ్ కి బాత్ వంటి కార్యక్రమాలు రూపొందించారు. యునెస్కో, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ వంటివారి సహకారంతో స్మార్ట్ స్టేషన్లు ఆరోగ్యం, లింగం, పౌర భాగస్వామ్యం, వాతావరణ మార్పు వంటి అంశాలను పరిష్కరిస్తున్నాయి. అలాగే వ్యక్తులు, మార్కెట్లు, మసీదులు, పాఠశాలలతో కలిసి పనిచేస్తాయి. ‘సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటున్నా మా కథనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. మా కమ్యూనిటీ సభ్యులు ప్రజలతో కలిసి పని చేయడమే దీనికి కారణం’ అని అర్చన చెప్పారు.
ప్రజల కోసం…
రేడియో స్టేషన్ స్థాపించడానికి ముందు అర్చన డాక్యుమెంటరీ చిత్రనిర్మాత. ఆత్మహత్యలు చేసుకున్న పత్తి రైతులు, వ్యవస్థాగత హింసలో కుంగిపోయిన కుటుంబాలపై ఆమె సినిమాలు చేసారు. ‘నేను వారితో మాట్లాడాను, వారితో కలిసి ఏడ్చాను, వారి ఇళ్లలో టీ తాగాను. కానీ వారిని మళ్లీ తిరిగి చూడలేకపోయాను. అది చాలా అన్యాయంగా అనిపించింది’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ ఆందోళ నుండే 1997లో ఓ ఎన్జీఓగా స్మార్ట్ రేడియో ప్రారంభమయింది. అర్చన మొదటిసారి 1999లో దక్షిణ హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలోని మేవాట్ను సందర్శించారు. ‘నాకు పెద్ద షాక్. ఢిల్లీ నుండి కేవలం 70 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో నీరు, రోడ్లు ఏమీ లేదు. రాజస్థాన్ నుండి వచ్చే గాలులు మా ముఖాలను తాకుతాయి. ఎన్జీఓలను వాళ్లు శత్రువుల్లా చూస్తారు’ అని అర్చన పంచుకున్నారు. అయినప్పటికీ ఆమె ప్రయత్నం కొనసాగింది. పది అనధికారిక విద్యా కేంద్రాలతో పని ప్రారంభించింది. ’14 ఏండ్ల వయసున్న బాలికలు ఆరేండ్ల పిల్లలతో కలిసి కూర్చోవడానికి ఇబ్బంది పడటం గుర్తించాము. అందుకే మేము గ్రూపులను సృష్టించి, దానికి అనుగుణంగా మార్చుకున్నాము. శ్రీలంక నుండి ‘నేర్చుకోండి – సంపాదించండి’ అనే మోడల్ను ప్రవేశపెట్టాము. మహిళలు కుట్టు యంత్రాలను తమ భుజాలపై ఎత్తుకొని కేంద్రానికి తీసుకెళ్లారు’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.
లోతుగా ప్రతిధ్వనించింది
కాలక్రమేణా ఇది 100 కేంద్రాలుగా పెరిగింది. స్థానిక మహిళలు చాలా మందిని నియమించుకున్నారు. కానీ ప్రభుత్వ ఉదాసీనత, అవినీతి వారికి అడ్డంకులుగా మారాయి. ‘ప్రభుత్వం మా బకాయిలను విడుదల చేయకపోతే డీసీ కార్యాలయం వద్ద ధర్నాలు చేసాము. చివరికి నేను ముఖ్యమంత్రిని కలిస్తే అప్పుడు నిధులు వచ్చాయి’ అన్నారు. 2007లో ఓ పత్రికా కథనం అర్చన దృష్టిని పూర్తిగా మార్చివేసింది. మార్పు కోసం శక్తివంతమైన అట్టడుగు సాధనంగా కమ్యూనిటీ రేడియో గురించి ఆ కథనం వివరించింది. ఆ ఆలోచన ఆమెలో లోతుగా ప్రతిధ్వనించింది. కేవలం రూ. 25,000తో స్టేషన్ను ఏర్పాటు చేయవచ్చని ఆ వ్యాసంలో చెప్పినప్పటికీ వాస్తవానికి రూ. 3-4 లక్షలు అవసరమయ్యాయి. యునెస్కో మద్దతుతో ఆమె 2010లో రేడియో మేవాట్ను ప్రారంభించారు.
నమ్మకాన్ని పెంచింది
కుట్టు వర్క్షాప్లు, కౌమార బాలికల సహాయ సమూహాలు, గృహ హింసలో జోక్యం, ఆరోగ్యం, ఆర్థిక సేవలు.. ఇవన్నీ సమాజం కోరుకుంటుంది. ‘మేము అమ్మాయిలకు కుట్టుపనిలో శిక్షణ ఇప్పించాము. వారికి కేంద్రంలోనే భోజనం ఏర్పాటు చేశాము. ఇదంతా వారిలో మాపై నమ్మకాన్ని పెంచింది’ అని అర్చన చెప్పారు. రేడియో మేవాట్ చేసిన అత్యంత ముఖ్యమైన పనులలో ఒకటి గ్రామీణ మహిళలను మార్పుకు మార్గదర్శకులుగా మార్చడం. ‘మాకు కవిత్వం రాసే ఒక అమ్మాయి ఉండేది. ఆమె పెండ్లి తర్వాత వెళ్లిపోయింది. తర్వాత ఫరీÛన్ మా ఆరోగ్య ఛాంపి యన్గా మారింది. ఇప్పుడు ఆమె కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) ఆరోగ్య రంగంలో ఆదర్శవంతమైన మహిళా అవార్డు గ్రహీత. ఆమె రూ.3 లక్షల రివార్డ్ తీసుకొని తన చెల్లికి వివాహం చేసింది’ అని అర్చన పంచుకున్నారు.
ప్రజల నుండి కథలు
‘రేడియో మేవాట్ ప్రభావంతో మౌనంగా ఉండటం నుండి వారు తమ స్వరాన్ని వినిపించడం వరకు వెళ్లారు. అందరూ వాళ్లను ‘యే రేడియో వాలి హై’ అని పిలుస్తారు. ఆ గుర్తింపు ఏదో లోతైన మార్పును కలిగిస్తుంది. ఇది వారికి స్వయంప్రతిపత్తిని ఇస్తుంది’ అంటూ అర్చన వివరించారు. ఈ రేడియో ఆర్థిక అక్షరాస్యత, తప్పుడు సమాచారం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తుంది. ‘మేము డెస్క్ రిపోర్టింగ్ చేయము. ప్రతి కథనం ప్రజల నుండి వస్తుంది. అందుకే ప్రజలు దీన్ని ఇంతగా ఆదరిస్తున్నారు’ అని అర్చన జతచేసారు.
మార్పుకు మార్గం వేస్తున్న మహిళలు
- Advertisement -
- Advertisement -