Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి

ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి

- Advertisement -

నవతెలంగాణ-తొగుట
ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజల మన్ననలు పొందాలని పోలీస్ కమిషనర్ డా క్టర్ బి. అనురాధ అన్నారు. శుక్రవా రం వార్షిక తనిఖీల్లో భాగంగా తొగుట పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసు కొని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగిం చాలని సంబంధిత ఎస్ఐకి సూచించారు. అధికా రులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిం చాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాల చెప్పారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ వాటిపై నిఘా పెంచాలని తెలిపారు.

ఇసుక, జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసు లు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిడి ఫైల్స్, ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని అధికారులకు హెచ్చరించారు. తొగుట పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ సిసిటిఎన్ఎస్ డాటా అప్డేట్ ఉన్నందున అధికారులను, సిబ్బందిని అభినందిం చారు. పోలీస్ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమ శిక్షణతో ప్రజలకు ఎల్ల వేళలా అందుబాటులో ఉండి నీతి, నిజాయితీగా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు.

(విపిఓ) విలేజ్ పోలీస్ ఆఫీసర్ కేటాయించిన గ్రామాలకు తరచుగా సందర్శిస్తూ ఇన్ఫ ర్మేషన్ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలని వివరించారు. విజబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించా లని ఉదయం, సాయంత్రం విసేబుల్ పోలీసింగ్ విధులు నిర్వహిం చాలని సూచించారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని అన్నారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్, యోగా చేస్తూ ఉండాలని, ఆరోగ్యంగా ఉంటే ఏదై నా సాధించ వచ్చని తెలిపారు. పాత నేరస్తులైన, కేడీలు, డీసీలు, సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని కోరారు. డ్రగ్స్ దాని యొక్క ప్రభావం, సైబర్ నేరా లు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవసరమైన ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఆర్ అండ్ బి అధికారుల సమన్వయంతో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో గజ్వేల్ ఏసిపి నర్సింహులు, తొగుట సిఐ లతీఫ్, తొగుట ఎస్ఐ రవికాంత్ రావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, దౌల్తాబాద్ ఎస్ఐ ప్రేమ్ దీప్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, కోర్టు మానిటర్  ఎస్ఐ రాజేష్, పోలీస్ స్టేషన్ల సిబ్బంది, సీసీ నితిన్ రెడ్డి, పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -