Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్
నవతెలంగాణ – పరకాల 

బిఆర్ఎస్ పార్టీ అంటేనే దోచుకుని దాచుకునే పార్టీ అని గత పదేళ్ల పాలన అంతా కమిషన్ల పాలన అని కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గత బిఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవానికి ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని అలాంటివారు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అందించిన ఘనత రేవంత్ రెడ్డి గారిదేనని తెలిపారు.

ప్రతి పేదవాడి కడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్తు, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇచ్చి పేదల కళ్ళల్లో ఆనందం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన ప్రజా పాలన నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ చిన్నల గోనాథ్ ఎండి రంజాన్ అలీ పంచగిరి జయమ్మ బుర్ర రాజమౌళి చందుపట్ల రాఘవరెడ్డి మెరుగు శ్రీశైలం పసుల రమేష్ మడికొండ సంపత్ ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి బండి సదానందం గౌడ్ మడికొండ శీను దుబాస్ వెంకటస్వామి ఏకు రాజు నల్లల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -