రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చే పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతనంగా నియామకమైన వైద్యాధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతనంగా నియమితులైన డాక్టర్లకి నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నియామకం అయిన వైద్యాధికారులు డాక్టర్ ఎస్ సాయి కృష్ణ,డాక్టర్ యన్ అమూల్య, డాక్టర్ బి ప్రణీత్ నాయక్,డాక్టర్ ప్రతిమలకు నియామక పత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,ఎస్పి కే నరసింహ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్ లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES