నవతెలంగాణ కథనానికి స్పందించి నిర్మాణ పనులు పరిశీలన
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన తెడ్డు జ్యోతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఇంటి పైనుండి విద్యుత్ లైన్ వెళ్తుండడంతో, నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని శనివారం నవతెలంగాణలో”విద్యుత్ లైన్ తో… ఇందిరమ్మ ఇంటి పనులకు బ్రేక్”అనే శీర్షిక ప్రచూరుతం కావడంతో, ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి స్పందించి నిర్మాణ పనులను పరిశీలించి, సమస్యపై విద్యుత్ ఉన్నత అధికారులతో మాట్లాడడంతో, క్షేత్రస్థాయి అధికారులను నిర్మాణ స్థలాని పరిశీలించాలని ఆదేశించడంతో, రెండు విద్యుత్ స్తంభాలు వెంటనే ఏర్పాటు చేసి విద్యుత్తు లైను పక్క నుండి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాధితులు నవతెలంగాణ కు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాణానికి అడ్డంగా ఉన్న విద్యుత్ లైన్ తొలగించాలి: నా రెడ్డి మోహన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES