సీఎంకు వ్యవసాయ కార్మికసంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయు) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు శనివారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఉపాధి సిబ్బంది వేతనాలు పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండిరగ్లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు నెలలుగా కూలీల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు పెట్టుకున్న వారికి కొత్త జాబ్కార్డులు ఇవ్వడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జాబ్ కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం లేదనీ, దీని వల్ల పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అనేకమంది పనికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేవనీ, పే స్లిప్పులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సమ్మర్ అలవెన్స్లు అమలు కావడం లేదని తెలిపారు. గ్రామపంచాయతీల నుంచి మంచినీరు అందించడం లేదని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేరని తెలిపారు. ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానాలను సీనియర్లతో భర్తీ చేయాలని పేర్కొన్నారు. వాచర్ సీనియర్ మేట్లకు ప్రత్యేక పని దినాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పట్టణ ప్రాంతాల పేదలకు ఉపాధి పనిని విస్తరింపజేసి 150 రోజులు పని దినాలు కల్పించాలనీ, రోజు కూలి రూ. 400 అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES