Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి..

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి..

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్
నవతెలంగాణ – మల్హర్ రావు
: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిస్కారం చేయాలని డివైఏప్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్యదర్శుల్లో ఎక్కువ శాతం మంది యువతీ యువకులే ఉన్నారని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రోజురోజుకూ వాళ్ల సమస్యలు పెరుగుతూ, పెనుముప్పుగా మారుతున్నాయన్నారు. తీవ్ర ఒత్తిళ్లకు ఇబ్బందులకు గురవుతున్నారని అప్పులు చేసుకుంటూ ఉద్యోగాల్ని కొనసాగించే పరిస్థితి ఉందంటూ, ఇప్పటివరకు కనీసం జాబ్ చార్ట్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నైనా వాళ్ల సమస్యలు పరిష్కరించబడతాయని, వాళ్ళు ఎంతో ఆశించారని కానీ ఇప్పటివరకు ఒత్తిళ్లు తప్పితే ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదన్నారు. గ్రామపంచాయతీలో ట్రాక్టర్లను నడిపే పరిస్థితిలో కార్యదర్శులు లేరని తక్షణమే గ్రామపంచాయతీలోకి నిధులు విడుదల చేసి గ్రామపంచాయతీ కార్యదర్శులకు జాబ్ చార్ట్ వల్ల ఆర్థిక సమస్యలు తీరే విధంగా వచ్చే విధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పని భారాన్ని తగ్గించే విధంగా పని ఒత్తులను తగ్గిస్తూ ఉద్యోగాన్ని నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలన్నారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో  గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యల పైన ఆందోళన పూనుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img