- Advertisement -
ఎంపీడీఓకు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు: తమ సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర,జిల్లా జెఏసి పిలుపు మేరకు సోమవారం మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపిడిఓ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నో అటెండెన్స్, నో డిఎస్ఆర్ విధానాన్ని కంటిన్యూ చేయాలన్నారు. ఒకవైపు డ్యూటీ చేస్తూనే డిఎస్ఆర్ యాప్ కు వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శుల సంఘం గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, కోశాధికారి సాయిచరణ్, ఉపాధ్యక్షులు రజిత, శివ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సతీష్ తోపాటు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -