- Advertisement -
– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కళాకారులకు ఉద్యోగాలిస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆమె తెలంగాణ ఉద్యమ కళాకారులతో భేటీ అయ్యారు. కళాకారులు తమకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని కవితతో గోడు వెళ్లబోసుకున్నారు. వారికి అండగా ఉంటానని ఆమె భరోసానిచ్చారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఇందిరా పార్క్ వద్ద కాళాకారులు చేపట్టబోయే ఆందోళనలో పాల్గొంటామని స్పష్టం చేశారు.
- Advertisement -



