– నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులు పెద్ది నారాయణ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అడవి బిడ్డల ఉద్యమ గర్జన కొమురం భీమ్ ఆదివాసి నాయక పోడ్ సేవా సంఘం మండల అధ్యక్షులు పెద్ది నారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని హాస కొత్తూర్ లో జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సర్కార్ పై భీకరంగా పోరాడిన గొండు బెబ్బులి కొమురం భీమ్ 85వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయక పోడు సేవా సంఘం మండల అధ్యక్షులు పెద్ది నారాయణ మాట్లాడుతూ ఆదివాసులను పీడిస్తున్న నిజాం సర్కార్ కు కొమురం భీమ్ ఎదురొడ్డి నిలబడ్డారని కొనియాడారు.
గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసులను సిద్ధం చేసి, నిజాంకు కంటిమీద కునుకు లేకుండా చేశాడన్నారు. సైన్యం తూటాలకు కొమురం భీమ్ నేలకొరిగాడని, కానీ ఆయన రగిలించిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చిందన్నారు. తద్వారా అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు.కార్యక్రమంలో ఆదివాసి నాయక పూర్ సేవా సంఘం అధ్యక్షులు పెద్ది ప్రభాకర్, సభ్యులు గంగాధర్, చిరంజీవి, సృజన్, రమేష్, పురుషోత్తం, ప్రవీణ్, మహేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
అడవి బిడ్డల ఉద్యమ గర్జన కొమురం భీమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES