- Advertisement -
– పాఠశాల అభివృద్ధి దాతలకు ఘన సన్మానం
నవతెలంగాణ – బెజ్జంకి
ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను భోధిస్తూ క్రమశిక్షణ అలవర్చుతారని..పిల్లల జీవన విధానంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని ప్రధానోపాద్యాయుడు తిరుమలేశ్ తల్లిదండ్రులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. రాబోయే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు క్రీడా దుస్తులు, షూస్, టై, బెల్ట్ అందించడానికి విరాళాలందించిన పలువురు దాతలను ఉపాధ్యాయ బృందం శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారమందుకున్న రామంచ రవీందర్ ను గ్రామస్తులు సన్నానించారు.
- Advertisement -