డాలర్ ఏ 92 చేరువలో..
నూతన రికార్డ్ కనిష్టం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి మరింత అగాథంలోకి పడిపోయింది. పతనంలో మరో ఆల్టైం నూతన రికార్డ్ను చవి చూసింది. భారత చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో శుక్రవారం డాలర్తో రూపాయి మారకం విలువ ఏకంగా 92కు అత్యంత చేరువకు పతనమయ్యింది. స్టాక్ మార్కెట్ల వరుస పతనం, విదేశీ సంస్థగత మదుపర్లు వరుసగా 13వ రోజూ భారీగా తమ నిధులను తరలించుకుపోవడం, అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంలో అనిశ్చితి, పడిపోతోన్న రూపాయిని కట్టడి చేయడంలో ప్రధాని మోడీ సర్కార్ వైఫల్యం, ఆర్బిఐ పెద్దగా కల్పించుకోకపోవడం తదితర పరిణామాలు ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జనవరి 23న ఒక్క పూటలోనే 0.34 శాతం కోల్పోయి 91.96కు దిగజారింది. గడిచిన ఆరు నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఒక్క వారంలోనే 1.18 శాతం క్షీణించింది. మరోవైపు జనవరిలో ఇప్పటి వరకు 2.3 శాతం బలహీనపడింది. 2025లో 5 శాతం పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 1.88 శాతం తగ్గి 63.70 డాలర్లుగా నమోదయ్యింది. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతులను తీవ్ర భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం అమాంతం పెరిగిపోనుంది. జనవరిలో ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత మదుపర్లు 3.5 బిలియన్ (దాదాపు రూ.32వేల కోట్లు) విలువ చేసే ఈక్విటీలను తరలించుకుపోయారు.
తీవ్ర అగాథంలోకి రూపాయి
- Advertisement -
- Advertisement -



