- Advertisement -
– జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిని అభినందిస్తూ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాంకేతికత, వినూత్న పద్ధతులతో బోధనలో తనదైన శైలిని రూపొందించుకుని ముందుకు సాగుతున్న, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన మారం పవిత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికైన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మారం పవిత్రను అభినందిస్తూ సీఎం ట్వీట్ చేశారు.
- Advertisement -