Saturday, June 7, 2025
E-PAPER
Homeఖమ్మంప్రారంభమైన బడిబాట...

ప్రారంభమైన బడిబాట…

- Advertisement -

ఇంటి ప్రచారంలో పాల్గొన్న ఎంఈఓ ప్రసాదరావు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట విజయవంతం చేయడానికి గాను శుక్రవారం ప్రతీ పాఠశాలలో పంచాయితీ రాజ్ శాఖ – విద్యాశాఖ ల సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ నేపద్యంలో మామిళ్ళ వారి గూడెం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ సభలో ఎంఈఓ ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాలను ఆయన వివరించారు.  ఏడాదికి రెండు జతలు ఉచిత ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన ఆటస్థలం, ఆట వస్తువులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని గ్రామస్తులకు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కావున మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. శుక్రవారం  నుండి ఈ నెల 19వ తేదీ వరకు ప్రతిరోజు బడి బాట నిర్వహిస్తామని, దీనిలో భాగంగా ప్రతి హ్యాబిటేషన్ లో విద్యార్థుల వివరాలను “విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్” లో అప్డేట్ చేస్తామని తెలియజేశారు. అనంతరం గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాల కు పంపాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సబిత,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు దివ్య, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తాటి శ్రీనివాసరావు,శ్యాం బాబు, రామారావు,కృష్ణ,శోభన్ బాబు,సీఆర్పీ మల్లేశ్వర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -