Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్తదాతల సేవలు అభినందనీయం..

రక్తదాతల సేవలు అభినందనీయం..

- Advertisement -

జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. సిహెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్..
నవతెలంగాణ – కామారెడ్డి
: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్, యూత్ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం నిర్వహించిన ఉత్తమ రక్తదాతల పురస్కారాల అభినందన, సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఆర్కే ఎన్ సిసి విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్ వి ఆర్ ఆర్ వరప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి లు మాట్లాడుతూ.. కామారెడ్డి రక్తదాతలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని,17 సంవత్సరాల నుండి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తక్కువ సమయంలోనే తలసేమియా చిన్నారుల కోసం మూడు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న డాక్టర్ బాలు ను ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సామాజిక సేవకులు సర్వ్ నీడి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గౌతమ్ మాట్లాడుతూ.. రక్తదానం చేయాలంటే మంచి మనసు ఉండాలని,మానవత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తారని అలాంటి రక్తదాతలకు కామారెడ్డి జిల్లాలో కొదవలేదని అన్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నందుకు కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సర కాలంలో మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేసిన 24 మందికి పురస్కారాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నంద రమేష్, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్,ఉపాధ్యక్షులు వెంకటరమణ,డీన్ నవీన్, ప్రిన్సిపాల్ లు గోవర్ధన్ రెడ్డి,శంకర్, మోతే రాజిరెడ్డి, శివకృష్ణ, అంజల్ రెడ్డి అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -