నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని చౌట్ పల్లి గ్రామం నుండి అమీర్ నగర్ వెళ్లే దారిలో బీటీ రోడ్డుపై అడ్డుగా ఉన్న బండారాలను కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి సిబ్బందితో ఆదివారం తొలగింపజేశారు. ఇటీవల కొందరు రైతులు వరి ధాన్యం బిటి రోడ్డుపై అరబోసుకొని ధాన్యానికి రక్షణగా పెద్ద పెద్ద బండారాలను అడ్డుపెట్టుకున్నారు. అనంతరం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి అమ్మేసుకున్నారు. అయితే రక్షణ కోసం రహదారిపై అడ్డుగా పెట్టిన బండరాలను మాత్రం తొలగించకుండా అలానే వదిలేశారు. ఆ దారి గుండా వెళ్తున్న ఎస్ఐ అనిల్ రెడ్డి రహదారిపై అడ్డుగా ఉన్న బండరాలను గమనించి తన సిబ్బందితోపాటు ఆ రోడ్డు గుండ వెళ్తున్న వాహనదారులతో బండరాలను తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ధాన్యానికి రక్షణగా పెట్టుకున్న బండారాలను రైతులు అలానే వదిలేసి వెళ్లారని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు బండరాలను గమనించకుండా వెళ్తే ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉందన్నారు. రైతులు రహదారులపై ఆరబోసిన ధాన్యానికి రక్షణగా బండరాలను పెట్టొద్దని, వాటి వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు.
రహదారిపై రాళ్లను తొలగింపజేసిన ఎస్ఐ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES