Monday, May 19, 2025
Homeసినిమా'వేయి వేణువుల నాదం మోగే'

‘వేయి వేణువుల నాదం మోగే’

- Advertisement -

రాజేంద్ర ప్రసాద్‌, అర్చన కాంబినేషన్‌లో రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో, హీరోయిన్లుగా పవన్‌ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకం పై రూపేష్‌ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ‘షష్టిపూర్తి’ నేపథ్యంలో వచ్చే గీతాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విడుదల చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ పాటను చైైతన్య ప్రసాద్‌ రచించగా, కార్తీక్‌, విభావరి ఆప్టే జోషి పాడారు. స్వర్ణ మాస్టర్‌ నత్య దర్శకత్వం చేశారు. ఈ పాట గురించి దర్శకుడు పవన్‌ ప్రభ మాట్లాడుతూ, ‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హదయాన! ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన! సరాదలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవై లో ఇరవైలా విరిసిన వరమాల…”అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్‌ అద్బుతంగా రాశారు. ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్న ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజా స్వరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది? ఈ పాట రికార్డింగ్‌ని ప్రత్యక్షంగా వీక్షించి, పులకించి పోయాను. సీనియర్‌ కళా దర్శకులు తోట తరణి ఓ మండువ లోగిలిని ఈ పాట కోసం అత్యద్భుతంగా తీర్చి దిద్దారు. నిజంగా ఓ పెళ్లి వేడుకలో ఉన్నపుడు మనకు ఎలాంటి ఫీలింగ్‌ కలుగుతుందో, ఈ పాట చూస్తున్నపుడు అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది. రాజేంద్రప్రసాద్‌, అర్చన, మా హీరో హీరోయిన్లు రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌లు ఈ పాటలో నిజంగా జీవించారు. చాలా కాలం గుర్తుండి పోయే పాట ఇది” అని తెలిపారు.
ఈ చిత్రానికి ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌, స్టంట్స్‌: రామకిషన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్‌, నిక్సన్‌ మాస్టర్‌, ఈశ్వర్‌ పెంటి, లిరిక్స్‌: కీరవాణి, చైతన్య ప్రసాద్‌, రెహమాన్‌, డీఓపీ: రామ్‌, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, నిర్మాత: రూపేష్‌, కథ- స్క్రీన్‌ ప్లే- సంభాషణలు- దర్శకత్వం : పవన్‌ ప్రభ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -