కుటుంబసమేతంగా అమ్మవారికి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే కార్యాలయం నుండి పోచమ్మ బోనంతో డప్పు సప్పులతో వెళ్లారు. పట్టణంలో రెండవ వార్డులో ఉన్న పోచమ్మ ఆలయంలో కుటుంబసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. అనంతరం హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా మొక్కలు చెల్లించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కెడం లింగమూర్తి , సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ , నాయకులు బూరుగు కిష్టస్వామి, చిత్తరి రవీందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం ముందుకు సాగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES