Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం విజయవంతం.!

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం విజయవంతం.!

- Advertisement -

పెద్దతూండ్ల మాజీ సర్పంచ్ లు అమల, విజయ..
నవతెలంగాణ – మల్హర్ రావు
: మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలోని శ్రీహానుమత్సహిత రాజరాజేశ్వరి పంచాయతన దేవాలయంలో ఈ నెల 4 నుంచి 12 వరకు శ్రీదత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ఇందువు సహకరించిన ఆలయ కమిటీ, దాతలకు, ఆయా గ్రామాల సందర్శకులకు, వేద పండితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లుగా మాజీ సర్పంచ్ లు చింతలపల్లి అమల-మలహల్ రావు, ఇనుగంటి విజయ-నాగేశ్వరరావు లు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం దత్తాత్రేయ ఆలయంలో మహిళలతో కలిసి పూజలు నిర్వహించి మాట్లాడారు. దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఎనిమిది రోజులపాటు వివిధ పూజలు కార్యకమాలతోపాటు, నిత్యా అన్నదానం నిర్వహించిన ఆలయ నిర్మాణ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -