మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ పై టి.వి. రవినారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాతలు.
మురళీమోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను, గ్లింప్స్ని మేకర్స్ రిలీజ్ చేశారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ,’కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్కు రమ్మని పిలిస్తే ఆమె వెళ్ళలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్గా మారిన టైంలో కూడా రాంబాబు, రవి నారాయణ ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం అభినందనీయం’ అని అన్నారు.
‘డొక్కా సీతమ్మ వంటి గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలియాలని మేం చేస్తున్న ప్రయత్నానికి మురళీ మోహన్ అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం మరువ లేనిది. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. ఈ సినిమాని అందరూ ఆదరించాలని ఆశిస్తున్నాను’ అని దర్శకుడు టి.వి.రవి నారాయణ్ తెలిపారు.
ఓ గొప్ప మనిషి కథ..
- Advertisement -
- Advertisement -