నవతెలంగాణ – ఢిల్లీ: 2025లో భారతీయులు 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ అందుకున్నారు, ఇది ప్రతిరోజు జరిగే కమ్యూనికేషన్ లో పెరుగుతున్న మోసము, అంతరాయం మరియు డిజిటల్ ప్రమాదాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశములో, ప్రతి ఫోన్ కాల్ కు ఒక అర్థం ఉంటుంది – అది అవకాశాల తలుపులు తెరవవచ్చు, కీలక సమాచారాన్ని అందించవచ్చు, లేదా వ్యక్తులను తీవ్రమైన ప్రమాదానికి గురి చేయవచ్చు. వికసిత భారత్ విషన్ కింద దేశము డిజిటల్ సాధికారత మరియు ప్రపంచవ్యాప్త పోటీ ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న వేళ, కమ్యూనికేషన్ లో నమ్మకము పురోగతికి ఒక మూలస్థంభం అయింది.
ట్రూకాలర్ యొక్క తాజా నివేదిక ప్రకారం 1,189 కోట్ల అవాంఛనీయ కాల్స్ యూజర్లకు చేరే ముందే బ్లాక్ చేయబడ్డాయి, తద్వారా లక్షలమంది యూజర్లు స్కామ్స్ నుండి , సమయం వృథా కాకుండా మరియు పెరుగుతున్న అనుసంధానిత ఆర్థిక వ్యవస్థలో అనవసరమైన ఒత్తిడి నుండి తప్పించబడ్డారు. దేశములో 100 కోట్లకు పైగా క్రియాశీలక ఫోన్ కనెక్షన్లు వాణిజ్యము, పరిపాలన మరియు వ్యక్తిగత సంబంధాలకు బలాన్ని ఇస్తుండగా, ట్రూకాలర్ ఈరోజు తన 2025 ఇండియా ఇన్సైట్స్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక స్పామ్ మరియు మోసము దేశ కమ్యూనికేషన్ ను ఎలా పునర్నిర్మిస్తున్నాయో మరియు ప్రతిరోజు కోట్ల మందిని సాంకేతికత ఎలా రక్షిస్తుందో తెలిపే ఒక డేటా-ఆధారిత సమీక్షను అందించింది .
డిజిటల్ రిస్క్ పరిధి మరియు రక్షణకు పెరుగుతున్న ప్రాముఖ్యతను వెల్లడిస్తూ ఈ నిర్ణయాలు 2025లో ఎలా ఫలించాయో ఈ నివేదిక తెలుపుతుంది, .
“కనెక్టివిటి ప్రతి స్థాయిలో అవకాశాలను బలోపేతం చేస్తున్న ఒక దేశములో, నమ్మాము అత్యంత విలువైన డిజిటల్ ఆస్తి అయింది,” అని రిషిత్ ఝున్ఝున్వాలా, సీఈఓ, ట్రూకాలర్ అన్నారు. “ఈరోజు మోసము అనేది కేవలం ఒక సాంకేతిక సమస్య కాదు, ఇది మనుష్య సంబంధమైనది. ఇది అత్యంత ముఖ్యమైన క్షణాల్లో భయం, ఆవశ్యకత మరియు అనిశ్చితిని ఉపయోగించుకుంటుంది. ఏ భారతీయుడు కనెక్ట్ అయి ఉండటం మరియు సురక్షితంగా ఉండటం మధ్య ఎంచుకునే అవసరం రాదని నిర్ధారించుటకు మా బాధ్యత. ట్రూకాలర్ లో మా ఉద్దేశము చాలా సులభమైనది; ప్రజలు వారి భద్రతతో రాజీపడకుండా మరియు ఒక రిస్క్ నష్టముగా మారే ముందే ఆపడములో వారికి సహాయపడటం.”
2025లో కమ్యూనికేషన్ రిస్క్ పరిధి
నివేదిక ప్రకారం, 2025లో భారతదేశవ్యాప్తంగా ట్రూకాలర్ 4,168 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ ను గుర్తించింది, ఇది అంతరాయం కలిగించే మరియు హానిచేయగల కమ్యూనికేషన్ యొక్క పూర్తి స్థాయిని ప్రతిబింబిస్తుంది. వీటిలో, ను ట్రూకాలర్ యూజర్ల ద్వారా 1,183 కోట్ల అవాంఛనీయ కాల్స్ బ్లాక్ చేయబడ్డాయి. వీటికి తోడు, 770 కోట్ల మోసపూరిత కాల్స్ కూడా కనుగొనబడ్డాయి, వీటిల్లో చాలా కాల్స్ బ్యాంకులు, ప్రభుత్వ అధికారులు, చెల్లింపు వేదికలు మరియు ప్రముఖ బ్రాండ్స్ లాగా అనుకరణ చేశాయి.
స్పామ్ మెసేజింగ్ కూడా ఒక ముఖ్యమైన ఆందోళనగా నిలిచింది. ఈ సంవత్సరములో, 12,903 కోట్ల స్పామ్ ఎస్ఎంఎస్ లు గుర్తించబడ్డాయి, ఇవి 2025 సంవత్సరపు ద్వితీయార్ధములో గణనీయంగా పెరిగాయి. చట్టబద్ధమైన హెచ్చరికలు మరియు మోసపూరితమైన మెసేజ్లు ఒకే డిజిటల్ స్పేస్ ను పంచుకుంటాయి, యూజర్లు వేగవంతమైన మరియు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, దీనితో చిన్న పొరపాట్లు కూడా భారీ అవుతాయి.
ఈ అంకెలు ఆచరణాత్మక కొలమానాలను సూచిస్తాయి. ఇవి సంభావ్య అంతరాయము, తికమక మరియు ప్రమాదము యొక్క లక్షల కొద్దీ క్షణాలను హాని నివారించబడిన లక్షల క్షణాలను ప్రతిబింబిస్తాయి.
సమయం, శ్రద్ధ మరియు నమ్మకాన్ని రక్షించడం
గుర్తించబడిన మొత్తం స్పామ్ కార్యకలాపాలలో, కమ్యూనిటీ రిపోర్టింగ్ 1,189 కోట్ల కాల్స్ యూజర్లను చేరకుండా నివారించడములో సహాయపడింది. 1.8 నిమిషాల సగటు స్పామ్ కాల్ సమయము ఆధారంగా, భారతీయులు ప్రతిరోజు సుమారు 21.7 లక్షల గంటలు మరియు ప్రతి వారం 1.5 కోట్ల గంటలకు పైగా సమయం వృధా కాకుండా తప్పించుకున్నారు.
ప్రతిరోజు, ప్రజలు ఆదా చేసే సంచిత సమయం, మానవ జీవితములో సుమారు 250 సంవత్సరాలకు సమానం, ట్రూకాలర్ కు ధన్యవాదములు. సమయం ఆదా చేయడమే కాకుండా, ఈ రక్షణ శ్రద్ధను పరిరక్షించుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు తరచూ ఆర్ధిక నష్టానికి దారితీసే అత్యవసరం-ఆధారిత నిర్ణయాలను నివారించడములో సహాయపడుతుంది. స్పామ్ ను బ్లాక్ చేయడం కేవలం సౌకర్యానికి సంబంధించినది మాత్రమే కాదు – ఇది ప్రజలను వారి డిజిటల్ ఇంటరాక్షన్స్ లో నమ్మకాన్ని రక్షించడము గురించి కూడా- .
2026లో మరింత ప్రముఖంగా ఉంటాయని ఆశించబడే, గుర్తింపు ధృవీకరణ స్కామ్స్, ప్రముఖ సంస్థలను ఉపయోగించి ప్రతిరూప ప్రవర్తన, మెసేజ్లు మరియు కాల్స్ ను కలుపుతూ బహుళ-దశల మోసాలు, AI-ఆధారిత వాయిస్ మెసేజ్ లు మరియు మూడవ-పార్టీ మెసేజింగ్ వేదికలకు స్కామ్స్ యొక్క మైగ్రేషన్ సహా అనేక్ స్కామ్ వ్యూహాలను ఈ నివేదిక ప్రాధాన్యీకరిస్తుంది.
ఈ బెదిరింపులు వృద్ధి చెందుతుండగా, వేరుచేయబడిన సంకేతాలు కాకుండా ప్రవర్తనాత్మక సందర్భలు, కమ్యూనిటీ రిపోర్టింగ్ మరియు దీర్ఘ-కాలిక కార్యక్రమాల వైఖరులపై నమ్మకం ఆధారపడి ఉంటుంది.
అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర అభ్యర్ధనలను ధృవీకరించాలని, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయకూడదని మరియు విశ్వసనీయమైన గుర్తింపు సాధనాలపై ఆధారపడాలని ట్రూకాలర్ యూజర్లను ప్రోత్సహిస్తుంది.



