బెంబేలెత్తిస్తున్న ప్రయాణికులు.!
రోడ్డుపైనే పార్కింగ్.
త్వరగా లారీ లోడింగ్ కావాలంటే
రూ.2 వేల నుంచి రూ.3 వేలు లంచం ఇవ్వాలసిందే.
పట్టించుకోని టిఎండిసి అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు.
మండలంలోని మల్లారం ఇసుక క్వారీలో ఇసుకను రవాణా చేస్తున్న లారీల తీరు మారడం లేదు.వందలాది లారీలు రోడ్డుపై పార్కింగ్ చేయడంతో తాడిచెర్ల నుంచి కొయ్యుర్ ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం లోడింగ్ కోసం డీడీలు తీయడమే కాకుండా త్వరగా లోడింగ్ లైన్లో ఉండకుండా తాము లోడింగ్ కోసం ఇసుక క్వారీ నిర్వహకుడికి రూ.2 వేల నుంచి రూ.3 వేలు అదనంగా ఇస్తున్నామని లారీల డ్రైవర్స్,యజమానులు వాపోతున్నారు.క్వారీ నిర్వాహకుడు లారీ డ్రైవర్ల వద్ద లంచాలు వసూలు చేస్తున్న టిఎండిసి అధికారులు మమూళ్ళమత్తులో జోగుతున్నారే తప్పా క్వారీ నిర్వాహకుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రాఫిక్ జామ్…
తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, లారీల వేగానికి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నా ఇసుక క్వారీ నిర్వాహకుల తీరు ఏ మాత్రం మారడం లేదు.. మరి కాస్త జోరును పెంచి వందల సంఖ్యలో ఇసుక లారీలను తరలిస్తూ ప్రజారవాణకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు.మల్లారం ఇసుక క్వారీ నుండి మితిమీరిన వేగంతో దూసుకు వస్తున్న లారీలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుకు ఇరువైపులా లారీలు వస్తుండడంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరగలమా అని హడలిపోతున్నారు. ఇసుక క్వారీల వద్ద లారీల నిర్వహణకు పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించినట్లు రికార్డుల్లో పేర్కొంటున్న క్వారీ నిర్వాహకులు వాస్తవంలో ఆ నిబంధనను పాటించకుండా మాల్లారం-కోయ్యుర్ ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో లారీలను నిలపడం మూలంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. వన్ వే నుంచి రాకపోకలు కొనసాగిద్దామనుకున్నా రెండో వైపు నుండి కూడా లారీలు వస్తుండడం వల్ల ఆటోల్లో ద్విచక్ర వాహనాలపై కార్లలో ప్రయాణిస్తున్న సామాన్యులు లారీల మధ్య బిక్కుబిక్కుమంటూ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇసుక లారీల వల్ల గంటల తరబడి ట్రాఫిక్ చిక్కుకుపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు అవసరాల నిమిత్తం మండల కేంద్రమైన తాడిచెర్లకు వెళ్లి రావాలన్నా, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లలన్నా ఇసుక లారీల వల్ల సకాలంలో చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న టిడిఎంసి, స్థానిక రెవెన్యూ అధికారులకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని బహిరంగంగానే చర్చించుకోవడం గమనార్హం. ఇసుక క్వారీలకు అనుమతులను ఇచ్చేటప్పుడు లారీలను నిలుపుకునేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చూపించే క్వారీ నిర్వాహకులు ఆచరణలో ఇసుక క్వారీల వద్ద ఇసుకను డంపు చేసుకోవడంపై దృష్టి పెట్టి లారీలను ప్రధాన రహదారిపైనే నిలుపుతున్నారు. క్వారీలను పరిశీలించి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న క్వారీలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత టిడిఎంసి,మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు చూడక పోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి నిబంధ నిబంధనలు ఉల్లంఘిస్తూ ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతున్న క్వారీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
మారని మల్లారం ఇసుక క్వారీ లారీల తీరు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES