నవతెలంగాణ మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు సహకారంతో లచ్చన్ గ్రామాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరుస్తానని ఆ గ్రామ సర్పంచ్ సంజు నవ తెలంగాణకి తెలిపారు. గ్రామంలో 20 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు సర్పంచ్ సిసి రోడ్లకు నీటిని పడుతున్న దృశ్యం నవతెలంగాణ చిత్రీకరించింది. అనంతరం ఆయనతో నవతెలంగాణ మాట్లాడగా గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు అభివృద్ధి పనుల్లో తానే సొంతంగా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డుకు సొంతంగా సర్పంచి నీటిని పట్టడం గ్రామ ప్రజలు ఆయన పనితీరును అభినందించారు.



