- Advertisement -
లింగుపల్లి సర్పంచ్ కిచ్చని రమేష్
నవతెలంగాణ – మిరుదొడ్డి
లింగుపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్ కిచ్చాని రమేష్ అన్నారు. సోమవారం మీరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు. ఉప సర్పంచ్ బాలకిషన్ వార్డు సభ్యులు చెవుల కిషన్, అమరేందర్ ,సునంద, భాగ్య, పవన్ లు నూతనంగా గ్రామపంచాయతీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఎంపీ ఓ పహిం, పంచాయతీ కార్యదర్శి షాహిని , మహిళా సంఘం సభ్యులు ఆశ వర్కర్ బాలమణి, అంగన్వాడి అనురాధ గ్రామస్తులు శంకర్ మల్లేశం రాజు చందు రాజయ్య భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



