- Advertisement -
ఠాణా సందర్శనలో ఏసీపీ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలోని గ్రామాలను సందర్శిస్తూ వీపీఓ వ్యవస్థను మెరుగుపర్చాలని ఏసీపీ రవీందర్ రెడ్డి ఎస్ఐ సౌజన్యకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఠాణాను ఏసీపీ రవీందర్ రెడ్డి సందర్శించారు.ఠాణా పరిసరాలను, రికార్డులను పరిశీలించి సిబ్బంది విధుల వివరాలను తెలుసుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ..పోలీసింగ్, మత్తుపదార్థాలు, సైబర్ నేరాలు, రౌడీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్ఐకి సూచించారు. పిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీను పాల్గొన్నారు.
- Advertisement -