Tuesday, June 3, 2025
E-PAPER
Homeదర్వాజవలసవాదం పై యుద్ధం: గూగీ వా థియాంగో

వలసవాదం పై యుద్ధం: గూగీ వా థియాంగో

- Advertisement -

ఆధునిక ప్రపంచసాహిత్యానికి పదునుపెట్టిన గొప్ప రచయితల్లో ప్రముఖుడు గూగీ. తరాల వలసవాదంపై ఎత్తిన తిరుగుబాటు గొంతుక. ఆఫ్రికాఖండంలోనే (కెన్యా) గొప్ప మేధావి, విద్యావంతుడు. తొలిసారిగా తన మాతభాష అయిన గికియులో రచనలు చేసి చరిత్రలో నిలిచాడు. తన రచనలద్వారా అనేకసార్లు నోబెల్‌ పురస్కార పోటీలో నిలిచాడు. గూగీ తన రచనా శైలితో వలసవాదానంతర భారతదేశ రచయితలను సాంస్కతికంగా, భాషాపరంగా ఉత్తేజపరిచాడు. రాజ్యపీడన శక్తులకు వ్యతిరేకంగా తన రచననే ఆయుధంగా వాడాడు. పాశ్చాత్య దేశాల పెట్టుబడి, నయా వలసవాద విధానాలను, సామ్రాజ్యవాద ఆర్థిక దోపిడీలను అనేకమార్లు ప్రశ్నించాడు. తన సీక్రెట్‌ లైవ్స్‌ లో ‘My writing is really an attempt to understand myself and my situation in the history’ అంటాడు. గొప్ప నవలారచయితగా, నాటకకర్తగా, వ్యాసకర్తగా, దర్శకుడిగా, విద్యాధికుడిగా విశేషకీర్తి పొందాడు.
డేవిడ్‌ కుక్‌, మైఖేల్‌ ఓక్నిమ్పి వంటి వారు గూగీ పోరాటపటిమను, రచనా వ్యక్తిత్వాన్ని, ఆలోచనా పరిణామాన్ని మాకిరిరి, యుగాండాలో డిగ్రీవిద్య మొదలుకొని లీడ్స్‌ విశ్వవిద్యాలయం, వలసవాదానంతరం అని మూడు విభాగాలుగా ఆయన జీవితాన్ని అంచనా వేశారు. జేమ్స్‌ గూగీ 1938 కామిరితు గ్రామంలో 5 జనవరి 1938లో జన్మించాడు. జేమ్స్‌ గూగీ 1970న తన పేరును గూగీ వా థియాంగోగా మార్చకున్నాడు. గూగీ తండ్రి థియాంగో ఒక గ్రామీణ రైతు. 1915 బ్రిటీషు చట్టం ప్రకారం తన భూమిలో తానే కబ్జాదారురైతుగా గుర్తించబడ్డాడు.
1950లో కెన్యాలో మౌ.మౌ. పోరాటయోధులకు, వలసవాదుల ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణ నాటికి గూగీ చిన్నవాడే. ఆ సంఘటన తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సందర్భంలో విధించిన అత్యవసర పరిస్థితుల వలన గూగీ తన సోదరుడిని కోల్పోయాడు. ఈ అంశాలను గూగీ అనేక సందర్భాలలో తన రచనలలో ప్రస్తావించాడు.
గూగీ యుగాండాలోని మాకిరిరి విశ్వవిద్యాలయంలో బి.ఎ. హానర్స్‌ చదివాడు. ఈ సమయంలో తన మొదటి నవలను రాయడం ప్రారంభించాడు. (The Black Messaiah) (ది బ్లాక్‌ మెస్సయ్య) దీని పేరు మార్చి నాలుగు సంవత్సరాల తరువాత The River Between (1965) గా ప్రచురించాడు. తన రెండవ నవల ‘Weep, Not child’ను 1964లో ముద్రించాడు. ఈ రెండు నవలలు సాంస్కతికంగా, జాతీయపరంగా ప్రఖ్యాతిగాంచినవి. మొదటగా The River Between’ నవలలో కెన్యా సంప్రదాయ పద్ధతులకు బ్రిటీషు వలసవాదాలకు మధ్య జరిగిన ఘర్షణను వివరించటం ఈ నేపథ్యంలో ఆఫ్రికా, కెన్యా యొక్క సాంస్కతిక వారసత్వాన్ని బలంగా ముందుకు తీసుకువచ్చాడు. ఈ నవలలో వలసవాద సాంస్కతిక దాడి నుండి తనను తానే కాపాడుకుంటూ పరిస్థితిని వివరించాడు.
అలస్‌ హన్హ, డా.ఆర్నాడ్‌ కెటిల్‌ పరిచయంతో వామపక్ష ఆలోచనా విధానాలతో ప్రభావితమయ్యాడు. ఆ ప్రభావంతో కారల్‌ మార్క్స్‌ మరియు ప్రాజ్‌ పానన్‌ రచనలు పూర్తిగా అధ్యయనం చేశాడు. ఒక సందర్భంలో గూగీ ఇలా అంటాడు Leeds Systematized my thinking’ అనంతరం గూగీ, తన మూడవ నవలపై దష్టి సారించాడు. ‘A Grain of Wheet’ (1967), 1963 నాటి కెన్యా దేశపు స్వాతంత్య్ర నేపథ్యాన్ని, అప్పటి స్థితిగతులను, దోపిడి, వ్యక్తివాదాలు వంటి అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. 1967 నాటికి గూగీ తిరిగి కెన్యా వెళ్ళి నైరోబి విశ్వవిద్యాలయంలో ఆంగ్లశాఖలో మొట్టమొదటి ఆఫ్రికన్‌ అధ్యాపకుడిగా చేరాడు. 1968 నుండి మరో ఇద్దరి మిత్రులతో కలసి ఆంగ్లశాఖ బహిష్కరణ అనే అంశంపై విస్తతంగా చర్చ ప్రారంభించారు. 1970 నాటికి దిస్‌ టైమ్‌ టుమారో(This Time Tomorrow) (1970) అనే నాటకం జేమ్స్‌ గూగీ పేరుతో వచ్చిన చివరి పుస్తకం. 1970-71 సంవత్సరంలో అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయం ((Northwestern University)) లో ఒక సంవత్సరం పనిచేశాడు. 1972వ సంవత్సరంలో ‘హెరీమ్‌ కమింగ్‌’ వ్యాససంకలనం వెలువడింది. ఈ వ్యాసాలలో భాష, సాహిత్యం మరియు సంస్కతుల మధ్య సమస్యలను సంబంధాలను వివరించాడు. 1975 ‘సీక్రెట్‌ లివ్స్‌’ అనే కథాసంకలనాన్ని ప్రచురించారు.
ఆరు సంవత్సరాలు తర్వాత 1977 గూగీ నాల్గవ నవల ‘పెటల్స్‌ ఆఫ్‌ బ్లడ్‌’ ప్రచురించాడు. ఈ నవలలో స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వం, పాలకులు, వారి విధానాలు, అభివద్ధి పేరుతో వారు చేసే విధ్వంసం దోపిడీని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు, ఉద్యమాలు తీసుకువచ్చిన నూతన ఆలోచనా విధానాలను ప్రస్తావించాడు. తర్వాత ‘గాహిక డేండా (‘I will marry when I want) అనే మరో నాటకాన్ని రాసి ప్రదర్శించడం జరిగింది. 1977లో ఈ నాటకాన్ని ప్రభుత్వం నిషేధించింది. సాంస్కతిక కేంద్రాన్ని పూర్తిగా నిర్మూలించి గూగీని జైలులో నిర్బంధించారు. గూగీ ఒక సంవత్సరంపాటు ఎటువంటి విచారణ లేకుండా కామితి మాక్సిమ్‌ (Kimiti Maxim Security Prission) సెక్యూరిటీ ప్రిసన్లో ఉంచారు. గూగీ జైలులో ఉన్న కాలంలో డిటైల్డ్‌ ప్రిసన్‌ డైరీ (Detailed 1981) అనే అనుభవాలను రాయటం ప్రారంభించాడు. ఇది తెలుగులో ‘బంధీ’ అనే పేరుతో వెలువడింది.
నాటకస్థలాలు సామాజికంగా, రాజకీయంగా ఐక్యంచేయటానికి విశాల ఐక్యవేదికకు ఉంటాయని భావించాడు. దానికి భాష అడ్డంకిగా ఉండకుండా ప్రజలను సమూహపరచాలని అనుకున్నాడు. ఈ పరిస్థితులు గూగీ ఆలోచనా విధానంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ భావంతో గూగీ ఇకనుండి ప్రజల కోసమే ఆడాలి, మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులను పునఃపరిశీలించాలని బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా ప్రజలకు దగ్గరగా సాహిత్య రచనలు ఉండాలనుకొన్నాడు. తన మాతభాష గికుయులోనే తన రచనలు ఉండాలని నిర్ణయించుకున్నాడు. జైలులో బంధీగా ఉన్న రోజులలో మొట్టమొదట గికుయు నవల ‘చితాని ముతరబా ఇని'(evil on the Cross) 1980లో ప్రచురించాడు. భోజన సమయాలలో సమూహాలుగా కూర్చొని అందరికోసం ఒకరు చదవాలి. బస్సులలో చదవాలి, కార్లలో చదవాలని, మద్యం తాగే సమయాలలో చదవాలి అని అంటారు. ఈ పుస్తకం ఒకే సంవత్సరంలో 15000 పుస్తకాలు మూడుసార్లుగా ముద్రించబడింది. ఈ పుస్తకాన్ని తెలుగులో స్వేచ్చా సాహితీ ప్రచురణలు ”మట్టికాళ్ల మహారాక్షసి’ అనే పేరుతో ముద్రించారు.
పిల్లలకథలు, ‘జాంబినేని మిని కథలు ఆ తరువాత సినిమాలు నిర్మించడం, వీటితో పూర్తిగా ప్రజలను చైతన్యపరచాలనే ఆలోచనతోనే ఉన్నాడు. 1981 ”రైటర్స్‌ ఇన్‌ పాలిటిక్స్‌ (Writers in Politics) బారెల్‌ ఆఫ్‌ పెన్‌ (1983) భాషాసాహిత్య, రాజకీయాలను ప్రస్తావిస్తూ ఈ రెండు వ్యాస సంకలనాలను ముద్రించాడు. 1986లో డికొలనైజింగ్‌ మైండ్‌(Decolonizing the Mind) ఆఫ్రికా సాహిత్యంలో రాజకీయభాష గురించి ప్రస్తావించాడు. భాషలోని సాంస్కతికంగా జరిగిన మార్పులను వివరించాడు. 1987లో ‘మాటిగరి’ అనే రెండవ గికుయు నవలను ముద్రించాడు. నయా వలసవాద విధానాల కెన్యాపై ఇది మరో బలమైన రచన. సమకాలీన పరిస్థితులను గురించి ప్రస్తావించడంతో ఈ నవల కెన్యాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రారంభంలో ఈ నవలను ఏకాలానికైనా ఏ ప్రాంతానికైనా, ఎవరినైనను ఊహించుకోవచ్చంటారు. ప్రధానపాత్రగా మాటిగరి మంజి రియాగో, మౌమౌ పోరాట యోధుడు కెన్యాకు స్వాతంత్య్రం వచ్చింది కదా అని ఆడవులలో ఉండవలసిన అవసరం లేదని భావించి బయటకు వచ్చి తన ఆయుధాలను చెట్టు కింద పూడ్చి పెట్టి, ఆకులతో శాంతి కవచం ధరిస్తాడు. బయట ప్రాంతానికి వచ్చి తన ఇల్లు, తన పిల్లలు, ఎక్కడ ఉన్నారు అని వెతకటం ప్రారంభిస్తాడు. అవి అన్నీ ఊహించిన పరిస్థితులలో లేకపోతే ఇవి ఎక్కడ దొరుకుతాయని వెతకటం ప్రారంభిస్తాడు. ఈ వెతకటంలో సత్యం, న్యాయం ఎక్కడ దొరుకుతుంది అంటూ కెన్యా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తారు. మాటిగరి మంజిరియాంగోను అరెస్టు చేయమని కెన్యా ప్రభుత్వం ఒక ఆజ్ఞను జారీచేసింది. పోలీసువారు దేశం అంతా వెదకగా మాటిగరి అనేది గూగీ సష్టించిన నవలలో ఓ పాత్ర అని వారి పరిశోధనల్లో తేలింది. ఈ నవలను తెలుగులో స్వేచ్ఛా సాహితీ ‘మాటిగరి’ అని ముద్రించింది. 1998లో ‘పెన్‌ పాయింట్‌, గన్‌ పాయింట్‌ అండ్‌ డ్రీమ్స్‌ టు వాట్స్‌ క్రిటికల్‌ థీరి అండ్‌ ద స్టేట్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించాడు. ఈ వ్యాసంలో రాజ్యం కళలు, కళలు రాజ్యం, పాలకులు మరియు రచయితల సంబంధాలను వివరించాడు.
సమాజంలోని రచయితల బాధ్యతలను గురించి కూడా గూగీ వివరించాడు. ఆఫ్రికాలో జరిగిన చారిత్రక పోరాటాలను గుర్తుచేస్తాడు. ”వాస్తవంగా ఈనాటికి కూడా వేలమందికి సరిగా బ్రతికే హక్కులేక దయనీయస్థితిలో ఉన్నారు. అనేకమంది ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా సమస్యలతో ప్రతిరోజూ చస్తూనే ఉన్నారు. ఈనాటి రాజకీయాలు వారిని ఆదుకునేలా లేవు” అంటాడు. 2004లో అనేక సంవత్సరాల తర్వాత గూగి కెన్యా వెళ్ళి 1000 పేజీల తన నవల ”మురోగి వా కగోగో” విడుదల చేయటానికి ప్రయత్నిసా. ఆ సందర్భంలో నెరోబిలో నలుగురు యువకులు గూగీ పై దాడిచేశారు. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులకు ఒక పెద్ద దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నవలను గూగీ ఇంగ్లీషులోకి స్వయంగా అనువాదం చేశాడు. విజార్డ్‌ ఆఫ్‌ ది క్రొ ఇది 20 సంవత్సరాల విరామంతో తరువాత వచ్చిన 700 పేజీల పెద్ద నవల. ఈ నవలలో ఆఫ్రికాలో ఉన్న నియంతత్వం, ప్రపంచ పెట్టుబడి వంటి వ్యవస్థలను ప్రత్యక్షంగా వివరిస్తాడు. తన రచనా శైలితో మూడవ ప్రపంచ దేశ పాఠకులకు చైతన్య స్ఫూర్తిని నింపిన గూగీ మే 28న మరణించారు.
– డా. శ్రీనివాసరావు కాసర్ల, 9492716146

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -