అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
నవతెలంగాణ – పరకాల : ప్రాధాన్యత క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 8వ వార్డులోని సీతారాంపురం,9వ వార్డు లోని బస్టాండ్ దగ్గర,13వ వార్డులోని సి ఎస్ ఐ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్ళకు భూమి పూజ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి, ఇంటినిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో వారిని ఉన్నతంగా నిలబెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు విడుతలవారీగా రూ 5లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES