Thursday, June 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

- Advertisement -

రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి 
సమస్యలన్నీ పరిష్కరిస్తాం 
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
నవతెలంగాణ – భూపాలపల్లి
: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27వ వార్డుల కాలని వాసుల సౌకర్యార్థం నూతన రేషన్ షాపును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు పేదలకు సన్న బియ్యం అందించాలనే కృతనిశ్చయంతో ప్రజా ప్రభుత్వం ఉందని, అందుకే సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోని ఆదర్శ పథకం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి…. 
రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పి ప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన జై బాపూ, జై భీమ్, జై సంవీధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కాలనీ వాసులు, నాయకులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం బాపూ, అంబేద్కర్, రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు పూల మాల వేసి, అక్కడున్న నాయకులు, ప్రజలతో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ఈ యాత్రనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ… భారత దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబేడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27వ వార్డులలో నెలకొన్న సమస్యలన్నీ అతి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 8వ వార్డు జవహర్ నగర్  కాలనీలోని  పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ నిధులు రూ.2 లక్షల వ్యయంతో వేసిన మంచి నీటి బోరు మోటారును స్విచ్ఛాన్ చేసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రజలకు మంచి నీటి ఇబ్బంది లేకుండా చూడటమే తన లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో పలువురు కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడున్న మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఏఈ మానస, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామస్వామి, మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, సజ్జనపు స్వామి, పానుగంటి హారిక శ్రీనివాస్, ముంజాల రవీందర్,  నాయకులు పెరుమాండ్ల తిరుపతి,  పోనకంటి శ్రీనివాస్, లతో పాటు  కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -