Friday, June 13, 2025
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ కళాశాలలో చదివితే ప్రయోజనాలు ఎన్నో: ప్రిన్సిపాల్ అనిత

ప్రభుత్వ కళాశాలలో చదివితే ప్రయోజనాలు ఎన్నో: ప్రిన్సిపాల్ అనిత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అశ్వారావుపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత కోరారు. బుధవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక భద్రాచలం రోడ్, సత్తుపల్లి రోడ్ తో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేపట్టారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, ఒకొక్క గ్రూపుకు 80 సీట్లు చొప్పున మొత్తం 320 సీట్లు ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్ ల ప్రక్రియ కోసం కళాశాల అధ్యాపకులను నాలుగు బృందాలుగా విభజించామ, ఒకొక్క బృందంలో నలుగురు చొప్పున 12 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో ఇప్పటిదాకా 50 సీట్లను భర్తీ చేశామని వివరించారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే విద్యార్ధులకు ఉన్నత విద్యను ప్రైవేటు కళాశాలలో లక్షలాధి రూపాయాలు చెల్లించ అవసరం లేకుండా ఉచిత సీటు అవకాశం దక్కుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ వసతి తో పాటు, డిజిటల్ తరగతులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డీ.వీ నరసింహారావు, ఎస్కే చాంద్ పాషా, ఎల్.ఎస్ ప్రసాద్, డేగల నరసింహారావు పాల్గొన్నారు!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -