- Advertisement -
- – భూక్య మోహన్ రాథోడ్ మండల సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట - ప్రభుత్వము పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులకు ఎక్కడ భయపడేది లేదని మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు భూక్య మోహన్ రాథోడ్ అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లను ముందస్తుగా అరెస్టు చేయడం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.చేతకాని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ అక్రమ అరెస్టులకు కొంచెం కూడా భయపడేది లేదు మేము చేసిన పనులకు వెంటనే మా బిల్లులను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మేము ప్రతి గ్రామపంచాయతీని పారిశుధ్యంలోనూ గాని అభివృద్ధిలో గాని ముందుంచి మా యొక్క సొంత నిధులు ఖర్చు చేసుకుని ఈరోజు అప్పుల పాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. మా బాధను అర్థం చేసుకుని మా బిల్లులను ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మీరు మా యొక్క బిల్లులను చెల్లించలేని ఎడల మేము మహాధర్నకు శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇట్టి అరెస్టులో చల్వాయి మాజీ సర్పంచ్ ఈ సమ్మయ్య పాపయ్యపల్లి మాజీ సర్పంచ్ రాకేష్ లక్ష్మీపురం మాజీ సర్పంచ్ లావణ్య స్వాతి వాగా పాల్గొన్నారు.
- Advertisement -