అమెరికావి ప్రగల్భాలే
ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసం కాలేదు
ఒకటి రెండు నెలల ఆటంకం…అంతే
యురేనియం నిల్వలను ముందే తరలించారు
అమెరికా రక్షణ ఇంటెలిజెన్స్ అంచనా
ట్రంప్ వాదనలకు ఎదురు దెబ్బ
నివేదిక లీకులతో ట్రంప్ అసహనం..ఆగ్రహం
వాషింగ్టన్ : ఇరాన్ అణు స్థావరాలను తమ దాడులు ధ్వంసం చేయలేకపోయాయని అమెరికా ఇంటెలిజెన్స్ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఈ దాడుల కారణంగా ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం కొద్ది నెలల పాటు వెనకపట్టు పడుతుందని తెలిపింది. అమెరికా ప్రయోగించిన బాంబులతో ఇరాన్ అణు స్థావరాలు నామరూ పాలు లేకుండా పోయాయని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రభుత్వానికే చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ వేసిన అంచనాలు ఈ వాదనతో విభేదిస్తున్నా యి. తమ దాడులలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని కూడా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే భూగర్భంలోని ఇరాన్ అణు స్థావరంలో ఒకటి రెండు నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోవచ్చునని తెలిపాయి.
దెబ్బతిన్నది ప్రవేశ ద్వారాలే
రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం..అమెరికా దాడులు భూగర్భ అణు స్థావరానికి చెందిన రెండు ప్రవేశ ద్వారాలను మాత్రమే ధ్వంసం చేశాయి. లోపల ఉన్న భవనాలు కూలిపోలేదు. దాడుల తర్వాత కూడా భవనాలలోని యంత్ర పరికరాలు పనిచేశాయి. దాడుల తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ వేసిన అంచనాల ఆధారంగా రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ నిర్ధారణకు వచ్చింది. తన ప్రకటనలకు భిన్నంగా ఇంటెలిజెన్స్ నుంచి లీకులు విడుదల కావటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకులను కప్పిపుచ్చుకోవటానికి నకిలీ వార్తలంటూ ఖండించే ప్రయత్నం చేయటం గమనార్హం.
విభేదించిన శ్వేతసౌధం
ఇరాన్ అణు శుద్ధి కర్మాగారాలను ‘పూర్తిగా, మొత్తంగా’ ధ్వంసం చేశామంటూ ట్రంప్ చేస్తున్న వాదనతో ప్రాథమిక అంచనాలు ఏకీభవించడం లేదు. అమెరికా దాడులకు ముందే అణు స్థావరాల నుండి శుద్ధి చేసిన యురేనియంను తరలించారని ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా దాడులు కొన్ని నెలల పాటు నిలువరించగలుగుతాయే తప్ప దానిని పూర్తిగా తుడిచిపెట్టలేదని తేల్చి చెప్పా యి. కాగా ఇంటెలిజెన్స్ అంచనాలను శ్వేతసౌ ధం కొట్టిపారేసింది. ‘ఇంటెలిజెన్స్ అంచనాలు అత్యంత రహస్యంగా ఉంటాయి. కానీ ఎవరో వాటిని లీక్ చేశారు. ఇది ట్రంప్ ప్రతిష్టను, సాహసోపేతంగా దాడులు జరిపిన పైలట్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది. వారి లక్ష్యాలపై పధ్నాలుగు 30,000 పౌండ్ల బాంబులను జారవిడిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అవి పూర్తిగా నాశనమవుతాయి’ అని శ్వేతసౌధం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ఓ ప్రకటనలో సీఎన్ఎన్కు తెలియజేశారు.
ఓ గొప్ప విజయం : ఇరాన్
యుద్ధాన్ని తాము విజయవంతంగా ముగించామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఇది తమకు ‘గొప్ప విజయ’మని ఆయన తెలిపారు. అమెరికాతో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నదని ఆయన సౌదీ రాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు చెప్పారు. తమ అణు పరిశోధనలు పౌర ఇంధన ఉత్పత్తి కోసమేనని ఇరాన్ చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్న విషయం తెలిసిందే.
అంత సీన్ లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES