Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'ఘాటి' లాంటి కథకు ఇది సరైన సమయం

‘ఘాటి’ లాంటి కథకు ఇది సరైన సమయం

- Advertisement -

రానాతో ఫోన్‌ సంభాషణలో
అనుష్క


నాయిక అనుష్క శెట్టి నటించిన రస్టిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘాటి’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో, యూవీ క్రియేషన్స్‌ సమర్పిస్తోంది. సెప్టెంబర్‌ 5న
ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో అనుష్క శెట్టి, డైరెక్టర్‌ క్రిష్‌ ఇద్దరికీ స్నేహితుడైన హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రం గురించి అనుష్కతో ఫోన్‌లో సంభాషించారు. సినిమా కంటెంట్‌, తన పాత్ర గురించి అడిగినప్పుడు అనుష్క ‘ఘాటి’ చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘ఘాటి’ వైలెంట్‌, ఇంటెన్స్‌ మూవీ. ఇందులో వయోలెన్స్‌ను పక్కన పెడితే, ఈ కథ ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు సరిపోతుంది. ఇలాంటి కథకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. ‘బాహుబలి, అరుంధతి’ తర్వాత వరుసలో ‘ఘాటి’ నిలిస్తుంది.
కథ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరుగుతుంది. ఈ బ్యాక్‌డ్రాప్‌, విజువల్స్‌ ఆడియన్స్‌కి చాలా కొత్త అనుభూతిని అందిస్తాయి. ప్రారంభంలో ఇది ఒక సమూహం కథగా ఉంటుంది. అయితే కథలోకి వెళ్లే కొద్దీ వ్యక్తిగతంగా మారుతుంది. దేశీరాజు, శీలావతి క్యారెక్టర్ల జర్నీని దర్శకుడు క్రిష్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో ప్రతీదీ ఆర్గానిక్‌గా ఉంటుంది.
కథలో అద్భుతమైన ట్రాన్ఫర్మేషన్‌ ఉంది. బాధితురాలు తన దారి తానే ఎంచుకున్నప్పుడు, ఆమె క్రిమినల్‌ అవుతుంది. కానీ ఆ ప్రయాణంలోనుంచి లేచి, ఒక లెజెండ్‌గా మారుతుంది. అదే రిడంప్షన్‌ ఆర్క్‌. మనం కోల్పోయిన దాంట్లోంచి మళ్లీ లేచినప్పుడే మనం మరింత గొప్పగా మారతాం. ఈ కథను చెప్పిన తీరు నిజంగా అద్భుతంగా ఉంది.
క్రిష్‌ నాకెప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు. ‘వేదం’లో సరోజ కూడా చాలా సున్నితమైన పాత్ర. దాన్ని ఆయన గొప్పగా చూపించారు. నా కెరీర్‌లో గుర్తిండిపోయే పాత్రల్లో అదీ ఒకటి. ఇప్పుడు ఇందులో శీలావతి కూడా అలాంటి మెమరబుల్‌ క్యారెక్టర్‌. అలాగే ఈ ఏడాది చివర్లోనే వరుసగా కొత్త ప్రాజెక్టులు చేస్తాను.
రానా మాట్లాడుతూ,’కొద్ది రోజుల క్రితం చెన్నైలో క్రిష్‌ని కలిసాను. అప్పుడు ఆయన ‘ఘాటి’ గురించి చాలా ఎగ్జైటెడ్‌గా మాట్లాడారు. దీంతో సినిమా చూడాలనే ఆసక్తి నాకూ పెరిగింది. ప్రీమియర్‌కి తప్పకుండా వస్తా’ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad