అగ్ర కథానాయకుడు ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాజా సాబ్’. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఓ మాల్లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకుల సందడి మధ్య గ్రాండ్గా నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ,’ఈ మూవీలో సాంగ్స్ సూపర్బ్గా వచ్చాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్యూటీఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన’ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇంకా రెండు సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ముగ్గురు హీరోయిన్స్ కాంబినేషన్లో ప్రభాస్ చేసిన సాంగ్, ఆ పాటలో ఆయన చేసిన డ్యాన్సులు మెస్మరైజ్ చేస్తాయి. జనవరి 8న ప్రీమియర్స్లో మనమంతా కలుద్దాం’ అని అన్నారు.
‘మీరంతా మా సినిమా మీద చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’ అని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ‘ఈ సినిమా నుంచి వస్తున్న కంటెంట్కు మీ దగ్గర నుంచి వస్తున్న మాస్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ప్రభాస్ మీ కోసమే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఫ్యాన్స్ను అలరించేందుకు చాలా కష్టపడతారు. ఈ సంక్రాంతి ‘రాజా సాబ్’తో రెబల్ సంక్రాంతి అవుతుంది’ అని తెలిపారు. ‘ప్రభాస్ అభిమానులకు నేనొక స్పెషల్ న్యూస్ షేర్ చేయాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ డేట్ను త్వరలో అనౌన్స్ చేస్తాం. అలాగే హైదరాబాద్లోని పబ్లిక్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ప్రభాస్ మూవీ రేంజ్ను ఈసినిమాతో చూడబోతున్నారు’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. హీరోయిన్ రిద్ది కుమార్ మాట్లాడుతూ,’పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరికీ థ్యాంక్స్. మీరు మా మీద, మా మూవీ మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు’ అని తెలిపారు.
ఈ సంక్రాంతి … రెబల్ సంక్రాంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



