Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిపోర్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

రిపోర్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

తాడ్వాయి ప్రెస్ క్లబ్
మండల కేంద్రంలో 163 జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం దాడికి పాల్పడిన నాయకులను కఠినంగా శిక్షించాలని తాడ్వాయి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. బుధవారం మండల కేంద్రంలో 163 వ జాతీయ రహదారిపై తాడ్వాయి ప్రెస్ క్లబ్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడికి పాల్పడగా వారిని కఠినంగా శిక్షించాలని, విలేకరులపై దాడులను ఆపాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు.

అధికారంలో ఉండి ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు సమాజంలో జరుగుతున్న అవకతవకలను లోపాలను వెలికి తీసే జర్నలిస్టులపై సైతం దాడులు చేయడం ఏమైనా చర్య అన్నారు. విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులపై దాల్ చేయడం ప్రజాస్వామి చర్య అని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోకిల సారయ్య, కోట రమేష్, ప్రతాప్, తమ్మల సమ్మయ్య గౌడ్, చింతల దేవేందర్, చింతల సంపత్, బోడ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -