- Advertisement -
నవతెలంగాణ – కాటారం
స్థానిక మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి ఆధ్వర్యంలో (రంగవల్లిక) ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామపంచాయతీ పాలక మండలి పాల్గొన్నారు.
- Advertisement -



