తహసిల్దార్ గుడిమెల ప్రసాద్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం కేటాయించిన మూడు నెలల రేషన్ కోట పంపిణీ చేయడం జరుగుతుందని తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు ప్రకారం వారి 3నెలల కోట రేషన్ తీసుకోవాలని కోరారు. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ కోటా రేషన్ కార్డుదారులకు జూన్ 1 నుండి 30 తేదీ వరకు హాయ్ రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రతి రేషన్ కార్డుదారులు రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. కొత్త రేషన్ కార్డులు సిఎస్ కమిషనర్ అప్రూవ్ అయిన వెంటనే కోటా యాడ్ అవుతుందని, కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు గమనించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
రేపటి నుండి మూడు నెలల రేషన్ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES