– ఏపీ హైకోర్టుకు జస్టిస్ బట్టు దేవానంద్
– దేశవ్యాప్తంగా 11 హైకోర్టుల నుంచి 21 మంది బదిలీ
– కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు న్యాయమూర్తులను కేటాయిస్తూ, ఒకరిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, ఏపీ హైకోర్టుకు జస్టిస్ బట్టు దేవానంద్ను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బిఆర్ గవారు నేతృత్వంలోని కొలీజియం ప్రతిపాదించింది. కర్నాటక హైకోర్టు జడ్జిలు జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటి, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్ రెడ్డిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలిజీయం వివరించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సుజరు పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించింది.
కర్నాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ వి.కామేశ్వరరావును ఢిల్లీ హైకోర్టుకు, గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ జమీర్ను కలకత్తా హైకోర్టుకు, గౌహతి హైకోర్టుకు చెందిన జస్టిస్ మనాష్ రంజన్ పాఠక్ను ఒరిస్సా హైకోర్టుకు, బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ నితిన్ వాసుదేయో సాంబ్రేను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రాను పంజాబ్-హర్యానా హైకోర్టుకు, గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సుమన్ శ్యామ్ను బాంబే హైకోర్టుకు, పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మను రాజస్థాన్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ చౌదరిని ఢిల్లీ హైకోర్టుకు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ను కర్నాటక హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ను మధ్యప్రదేశ్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లాను ఢిల్లీ హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ను బాంబే హైకోర్టుకు, పంజాబ్-హరియానా హైకోర్టు న్యాయమూర్తి సుధీర్ సింగ్ను పట్నా హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అరుణ్ కుమార్ను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జయంత్ బెనర్జీని కర్నాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులో పేర్కొన్నది.
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు జడ్జిలు
- Advertisement -
- Advertisement -