- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి : ప్రాథమిక విద్యను బలోపితం చేసేందుకు గాను మునిపల్లి మండలానికి మూడు పూర్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరైనట్టు మండల విద్యాధికారి భీంసింగ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని బుదేరాకాలనీ,కంకోలు ఉర్దూ మీడియం, లోనికుర్దు పాఠశాలలో ఇట్టి పూర్వప్రాథమిక కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత గల వారు బోధకులుగా ఏడవ తరగతి ఉత్తీర్ణత గల వారు ఆయాలుగా నియమించబడుతారని ఇందుకు సంబంధించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై ఎనిమిదవ తేదీకి దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి భీంసింగ్ సూచించారు.
- Advertisement -