Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నుంచి ముగ్గురు సస్పెండ్..

కాంగ్రెస్ నుంచి ముగ్గురు సస్పెండ్..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గాల్ 
సర్పంచ్ ఎన్నికల వేళా కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్న ముగ్గురు నాయకులకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తునట్లు మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్న నాయకులు నాగిరెడ్డి మాజీ సర్పంచ్, బస్వరాజ్ దేశాయ్,అంజనీ నాందేవ్ పటేల్ కు జుక్కల్ శాసన సభ్యులు తోట లాక్ష్మికాంత్ రావు ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తునట్లు పత్రిక సమావేశంలో ప్రకటించారు. పార్టీ కోసం పని చేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ లో సముచిత స్థానం కల్పించడం జరగుతుందని అన్నారు. కానీ కాంగ్రేస్ పార్టీకి వ్యతేరేక పనులు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిప్ప మోహన్,అక్కల్ సాయిరెడ్డి, మనిక్ రెడ్డి,సంజీవ్ ,కల్లూరి పందిరి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -