- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని NH 44పై పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారును మానవపాడు మండలం బోరవెల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దాని వెనుకనే వచ్చిన మరో మినీ ట్రావెల్ బస్సు వాటిని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



