Monday, June 2, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఈదురుగాలులతో కూడిన వాన

ఈదురుగాలులతో కూడిన వాన

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 235 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
వచ్చే ఐదురోజుల పాటు వర్షసూచన
నేడు, రేపు 10 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం, రాత్రి సమయాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు 235 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అందులో సగానికిపైగా ప్రాంతాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ నివేదిక ప్రకారం కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వాన పడింది. సోమవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 42.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. మంగళ, బుధ వారాలకు సంబంధించి పది జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు. ఆ జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, ములుగు, సిద్దిపేట, జనగాం జిల్లాలున్నాయని తెలిపారు. ఆ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలుల వర్షం పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా వానలు పడే అవకాశములున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -