నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం శ్రావ్య గార్డెన్లో సిబ్బందితో తమ తమ విధుల నిర్వహణ కోసము ఏ విధంగా నిర్వహించాలి అనే బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ప్రతి సిబ్బంది తమ విధులను నిక్కచ్చిగా నిర్వహించాలని , సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసిన త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని, ప్రతి సిబ్బంది తమ డ్యూటీ స్థలం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలియజేయడం జరిగింది. అనునిత్యము సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు. ఈ బందోబస్తుకు 600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సిసిఎస్, సి టి సి, ట్రాఫిక్ ఏసిపి లు రాజా వెంకటరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ నాగేంద్ర చారి, రాజశేఖర్, మస్తాన్ అలీ మరియు సీఐలు ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు: సీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES